దేశ మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మట్టా దయానంద్ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం సత్తుపల్లిలోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ ఆనంద్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చెన్నారావు తదితరులు పాల్గొన్నారు