సత్తుపల్లి పట్టణం, ద్వారకాపూరి కాలనీ 12వ వార్డులో ఇందిరమ్మ లబ్ధిదారుని ఇల్లు పనులను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. చిరు వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, పట్టణం కాంగ్రెస్ నాయుకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.