
మూడు దేశాల పర్యటనకు మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో యూరోప్లో ఉన్న సైప్రస్ దేశానికి వెళ్లనున్నారు. 16, 17 తేదీల్లో కెనడా వెళ్లి జీ7 సదస్సుకు హాజరవ్వనున్నారు. 18న క్రొయేషియా దేశాల్లో పర్యటించనున్నారు. ఆయా దేశాలతో సహకారం, సంబంధాలపై చర్చించనున్నారు.