
జమ్మూ పర్యటనకు బయలుదేరిన సీఎం ఒమర్ అబ్దుల్లా
పాకిస్థాన్ దాడి ప్రయత్నాలను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిన నేపథ్యంలో, జమ్మూ కశ్మీర్ CM ఒమర్ అబ్దుల్లా శుక్రవారం ఉదయం జమ్మూ నగరానికి బయలుదేరారు. గురువారం రాత్రి జమ్మూ సివిలియన్ ఎయిర్పోర్ట్, యూనివర్సిటీ వంటి కీలక ప్రాంతాలపై డ్రోన్లు, క్షిపణులతో పాక్ దాడి చేసేందుకు యత్నించగా, భారత భద్రతా దళాలు వాటిని విజయవంతంగా తిప్పికొట్టాయి. తాజా పరిస్థితులను సీఎం స్వయంగా సమీక్షించేందుకు జమ్మూకు బయలుదేరారు.