సత్తుపల్లి మండలం బ్రాహ్మలకుంట గ్రామములో భూక్య కళ్యాణి ఇటీవల మరణించినారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మట్టారాగమయి దయానంద్ గురువారం ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నేతలు, గ్రామనాయకులు పాల్గొన్నారు.