సత్తుపల్లిలోని 33/11కేవీ సబ్ స్టేషన్ పరిధి టౌన్-1 ఫీడర్లో సోమవారం ట్రీ కటింగ్ చేపడుతున్నందున ఉదయం 7గంటల నుంచి 9గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శరత్ బాబు తెలిపారు. పట్టణంలోని విద్యానగర్ రోడ్, వాణి విద్యాలయం రోడ్, ఎన్వీఆర్ కాంప్లెక్స్ రోడ్, ఎండీ ఆస్పత్రి రోడ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని తెలిపారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.