సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న అక్కాచెల్లెళ్ళు ధనదుర్గ, జోష్ణవి బాసర ఐఐఐటీ ప్రవేశ ఫలితాల్లో సీట్లు పొందారు. శుక్రవారం వెలువడిన ఫలితాలతో వారు పాఠశాల గర్వకారణంగా నిలిచారు. ప్రధానోపాధ్యాయులు నక్కా రాజేశ్వరరావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు వారిని అభినందిస్తున్నారు.