సత్తుపల్లి: నాలుగు నెలల్లో ట్రంక్ నిర్మాణం పూర్తి చేయాలి

75చూసినవారు
సత్తుపల్లి: నాలుగు నెలల్లో ట్రంక్ నిర్మాణం పూర్తి చేయాలి
సత్తుపల్లి ట్రంక్ టన్నెల్లో మిగిలిన 1. 2 కి. మీ. పనులు నాలుగు నెలల్లో పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం ఆదేశించారు. తద్వారా సత్తుపల్లి, పినపాక, మధిర, వైరా, ఆశ్వారావుపేట నియోజకవర్గాలకు సాగు నీరు అందించవచ్చని, వైరా రిజర్వాయర్ కింద లక్షా 30వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు. సీతారామ ప్రధాన కాల్వలో సిల్ట్ తొలగిస్తే బేతుపల్లి, వైరా ప్రాజెక్టులోకి సాఫీగా నీరు చేరుతుందన్నారు.

సంబంధిత పోస్ట్