సత్తుపల్లి పట్టణ శివారులో ఫ్లైఓవర్ బ్రిడ్జిపై లారీని ఓవర్ టేక్ చేస్తుండగా ద్విచక్ర వాహనదారుడికి గాయాలయ్యాయి. దమ్మపేట మండలం లింగాలపల్లి గ్రామానికి చెందిన సున్నం ప్రశాంత్ స్వగ్రామం నుంచి సత్తుపల్లికి వస్తుండగా వైజాగ్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేస్తుండగా లారీ ఢీకొంది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. సత్తుపల్లిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు.