ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించటంతో మనస్తాపానికి గురైన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. పెనుబల్లి మండలం బ్రహ్మాళ్లకుంట గ్రామానికి చెందిన భూక్యా కల్యాణి (22) సత్తుపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె ఓ యువకుడిని ప్రేమిస్తుండగా, ఇటీవల ఆయన పెళ్లికి నిరాకరించాడని తెలిసింది. దీంతో మసీద్ రోడ్డులో అద్దెకు ఉంటున్న ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.