తల్లాడ మండలం మిట్టపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో జేబు దొంగ హల్ చల్ చేశాడు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభలో మాట్లాడుతుండగా. జేబు దొంగ సభలోకి ప్రవేశించి పర్సులు, గోల్డ్ చైన్లు చోరీ చేస్తుండగా కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వెంటనే తల్లాడ ఎస్ఐ కొండల్ రావు దొంగను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.