తల్లాడ మండలంలోని నారాయణపురంలో నిర్వహిస్తున్న మహా చండీయాగంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. సండ్రకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వీరమోహన్ రెడ్డి, దుగ్గిదేవర వెంకట లాల్, కేతినేని చలపతిరావు, జీవీఆర్, దాసురావు, మాజీ జడ్పీటిసి సభ్యురాలు దిరిశాల ప్రమీలారాణి తదితరులున్నారు.