తప్పిపోయిన నాలుగేళ్ల పాపను తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించిన సంఘటన గురువారం సత్తుపల్లి పట్టణంలో జరిగింది. పట్టణ సీఐ టీ. కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం. అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపునకి చెందిన కొమరం నరేష్, వెంకటలక్ష్మీ దంపతుల నాలుగేళ్ల కుమార్తె సుష్మాని ఆధార్ అప్ డేట్ కోసం పట్టణానికి తీసుకువచ్చారు. తప్పిపోగా డయల్ 100కు కాల్ రాగా అరగంటలోనే ఆచూకీ లభ్యమైన పాపను తల్లిదండ్రులకు అప్పగించారు.