మర్లపాడు ధాన్యం రైతులు ఆవేదన

62చూసినవారు
మిల్లర్లు తమను నిలువునా దోచుకుంటున్నారని వేంసూర్ మండలం మర్లపాడు ధాన్యం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన తర్వాత తరుగు లేకుండా కాంటాలు వేసినా.. తీరా లారీలో లోడ్ ఎత్తే ముందు క్వింటాకు 5 కేజీలు ఇస్తే తప్ప తమ ధాన్యాన్ని తీసుకెళ్లమంటూ మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని రైతులు పేర్కొన్నారు. తక్షణమే అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్