వనజీవి రామయ్య ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ మొక్కలు నాటుతామని న్యూ విజన్ విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఖమ్మం నగరంలోని న్యూ విజన్ పాఠశాలలో ఈ గురువారం పద్మశ్రీ దరేపల్లి రామయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి సమర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ యం.డి. అబాద్ అలీ మాట్లాడుతూ సేకరించిన విత్తనాలు వర్షాకాలంలో ఖాళీ ప్రదేశాలలో చల్లి చెట్ల సంరక్షణకు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ సిహెచ్ కార్తీక్ ,పి.స్ఫూర్తి, పాఠశాల ప్రిన్సిపాల్ ఎండి. అబాద్ అలీ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.