కారేపల్లి మండలం నుంచి బదిలీ మీద వెళ్లిన సూపర్వైజర్ల స్థానంలో కొత్త సూపర్వైజర్స్ బదిలీపై వచ్చి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిడిపిఓ దయామణి సెక్టార్లు కేటాయించారు. విశ్వనాథపల్లి సెక్టార్ జి. రాధమ్మ, గాంధీనగర్ సెక్టార్ టీ. గీతా బాయి, చీమలపాడు సెక్టర్ ఎం రమణ, గేట్ కారేపల్లి సెక్టర్ పి దేవేంద్రమ్మ ను నియమించారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ అందుబాటులో ఉండే సేవలు అందజేయాలన్నారు.