జూలూరుపాడు మండల కేంద్రంలోని సాయిబాబా దేవాలయం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. బైక్పై వెళ్తున్న భార్యా భర్తలను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.