ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాలో శుక్రవారం విద్యుత్ ఉపకేంద్రానికి ఒక మహిళ తాళం వేసిన ఘటన జరిగింది. గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వం హయాంలో కొత్తగా విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణం చేపట్టడానికి ఒక మహిళ తన స్థలాన్ని ఇస్తా అని చెప్పింది. దానికి బదులుగా ఉద్యోగం ఇవ్వాలని కోరగా అప్పటి ప్రభుత్వం ఒప్పుకుని విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణం చేపట్టింది. కానీ, ఆ మహిళకు గాని, తన కుటుంబ సభ్యులలో ఒకరికి గాని ఉద్యోగం ఇవ్వలేదు. అందుకుగాను ఆ మహిళ విద్యుత్ ఉపకేంద్రానికి తాళం వేసినది.