తల్లాడ మండలం నూతనకల్ గ్రామానికి చెందిన గొల్లమందల కృష్ణ శనివారం అనారోగ్య కారణంతో మరణించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు గణేశుల రవి, కళ్యాణపు వెంకటయ్య ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వీరబాబు ముదిరాజ్, వంగూరు భూషణం, పుల్లయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.