తల్లాడ మండలంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకులుగా పనిచేస్తున్న వాళ్లకు గత మూడు నెలలుగా జీతాలు రావడం లేదని తల్లాడ ఎంపీడీవో సురేష్ బాబుకి బుధవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు నెలలుగా జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి జీతాలు మంజూరు చేయాలని కోరారు.