ఇల్లందు నుండి ఖమ్మం వెళుతున్న కారును ఖమ్మం వైపు నుండి ఇల్లందు వెళుతున్న లారీ శుక్రవారం రాత్రి ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. కారేపల్లి మండలపరిధిలోని సీతారాంపురం శాంతినగర్ మధ్యలో పాల్వంచకు చెందిన పాస్టర్ వాసిమల్ల ప్రతాప్, వాసిమల్ల సావిత్రి, ఎతిన్ ఇల్లందు నుండి ఖమ్మం వైపు వెళుతుండగా సీతారాంపురం సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది.