కారేపల్లి మండల పరిధిలోనే అప్పాయి గూడెం గ్రామంలోనే రైతు వేదికలో గత మూడు రోజులుగా నిర్వహించిన శిక్షణ శిబిరం శనివారంతో ముగిసింది. సిడిపిఓ దయామణి మాట్లాడుతూ ప్రభుత్వం సవరించిన నూతన విద్యా విధాన బోధనపై అంగన్వాడీ టీచర్లకు శిక్షణ నిర్వహించినట్లు ఆమె తెలిపారు. ఇప్పటికీ కారేపల్లి మండలంలో 105 మంది అంగన్వాడీ టీచర్లకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు.