
వరల్డ్లో తొమ్మిదవ అత్యంత రద్దీ ఎయిర్పోర్ట్గా ఢిల్లీ ఎయిర్పోర్ట్
2024లో ఢిల్లీ విమానాశ్రయం ప్రపంచంలో తొమ్మిదవ అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్గా గుర్తింపు పొందింది. ఏడాది మొత్తం 7,77,20,834 మంది ప్రయాణికులు ఈ ఎయిర్పోర్ట్ను ఉపయోగించారు. భారత్లో పెరుగుతున్న ప్రయాణ అవసరాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధితో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఒక ప్రధాన విమానయాన కేంద్రంగా మారింది. అంతర్జాతీయ ర్యాంకుల్లో తన స్థానాన్ని బలపరుస్తూ భారత్ గ్లోబల్ విమానయాన రంగంలో కీలక పాత్ర పోషిస్తుంది.