నిరంతరం ప్రజల పక్షాన పోరాడే సీపీఎం ను ప్రజలు ఆదరించాలని సీపీఎం వైరా డివిజన్ కార్యద ర్శి భూక్యా వీరభద్రం పిలుపునిచ్చారు. ఆదివారం వైరా మున్సిపాలిటీ పరిధిలోని గండగలపాడులో గడప గడపకు సీపీఎం కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రతీ గ్రామంలోని సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ఉద్యమాలు బలోపేతం చేయాలన్నారు. పాలక ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఉన్నారు.