భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నుండి గుండాల వైపు వెళ్తున్న ద్విచక్రవాహనం సూమిడిగూడెం వద్ద శుక్రవారం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో పాలకు తండాకు చెందిన వంటమాస్టర్ గుగులోత్ వినోద్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ గాయపడగా, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.