కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నిప్పులు చెరిగారు. "160 సీట్లు వస్తాయని చెప్పినప్పుడు KK సర్వే మంచిదని చెప్పినవాళ్లు, ఇప్పుడు ఏడాది కూటమి పాలన తర్వాత 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఓడిపోతారని చెప్పితే అదే సర్వే చెడ్డదైపోతుందా?" అని ప్రశ్నించారు. జగన్ మళ్లీ వస్తారనే భయంలో కూటమి ప్రభుత్వం ఉందని అన్నారు. ఒక్క సంవత్సరానికే చంద్రబాబు పాలనపై నెగిటివిటీ వచ్చిందని చెప్పారు.