కొమురం భీం జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని నెల రోజులు జులై 1 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పి డీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు రాస్తారోకోలు, ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని తెలిపారు.