
కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకారం: పాక్ డిప్యూటీ పీఎం
పాకిస్థాన్, భారత్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ విషయాన్ని ఆ దేశ డిప్యూటీ పీఎం, విదేశాంగశాఖ మంత్రి ఇషాక్ దార్ ట్వీట్ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈ విషయాన్ని Xలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఇరు దేశాలు విజ్ఞతతో, తెలివిగా వ్యవహరించాయని ధన్యవాదాలు తెలిపారు. తాజాగా భారత విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ సైతం కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లు ప్రకటించారు.