కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ దుర్గం మహేశ్వర్ శుక్రవారం ఒక ప్రకటన తెలిపారు. ఇంటర్ మొదటి సం. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసి, సిఇసి గ్రూపుల్లో మొత్తం 160 మంది సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. టెన్త్ విద్యార్థులు సాధించిన మెరిట్ ఆధారంగా రోస్టర్ ప్రకారం ఎంపిక ఉంటుందన్నారు.