ప్రజల రక్షణకు జిల్లా పోలీస్ శాఖ సిద్ధంగా ఉంటుందని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు శనివారం అన్నారు. కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు, సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్లను నమ్మవద్దని, పోలీస్ శాఖ, ప్రభుత్వం ఇచ్చే అధికారిక సమాచారాన్నే నమ్మాలని ప్రజలకు సూచించారు.