వెనక పడ్డ ఆదివాసీ బ్రతుకు చీకటి జీవనం పోవాలంటే చదువు ఉండాలని, అక్షరంతోనే జీవన శైలిలో మార్పు వస్తుందని, విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ముడిపడి ఉందని, విద్యార్థులందరూ క్రమశిక్షణతో విద్యనభ్యసించాలని తిర్యాణి ఎస్ ఐ శ్రీకాంత్ పేర్కొన్నారు. గురువారం రాత్రి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించారు మొబైల్ ఫోన్ ల అధికంగా వాడకం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.