ఆసిఫాబాద్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ 46వ గురు కృప దినోత్సవంలో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్యామ్ నాయక్ సంత్ సద్గురు దీక్షా గురువు ప్రేమ్ సింగ్ మహారాజ్ ఆశీర్వాదం తీసుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అలాగే దీక్షా భూమి కొత్తపల్లి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అని హామీ ఇచ్చారు.