ఈనెల 20న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు టి. దివాకర్ పిలుపునిచ్చారు. శనివారం సమ్మె వాల్ పోస్టర్లను ఆర్టీసీ కార్మికులతో కలిసి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలని 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు, కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలు మానుకోవాలని డిమాండ్ చేశారు.