తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం ( టీయూడబ్ల్యూజే ) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైన ఆర్ ప్రకాష్ రెడ్డి బుధవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా టియుడబ్ల్యూజే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు శాలువాతో ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు అతి త్వరలో ఇప్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు