బెజ్జూరు: తరతరాల నుండి ఉన్న కష్టం నేటికి నెరవేరింది

68చూసినవారు
బెజ్జూరు: తరతరాల నుండి ఉన్న కష్టం నేటికి నెరవేరింది
బెజ్జూరు మండలంలోని మర్తిడి గ్రామం నుండి సలుగుపల్లి గ్రామం వరకు మూడు కోట్ల రూపాయలు విలువ గల తారు రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో ఇరు గ్రామస్తులు, శనివారం కోనేరు కోనప్ప చిత్రపటానికి క్షీరాభిషేకంతో కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే మర్తిడి గ్రామం నుండి సుమారు వందల మంది విద్యార్థిని, విద్యార్థులు సలుగుపల్లి ప్రథమికొన్నత పాఠశాలలో చదువుతున్నారు. ఈ కార్యక్రమంలో మర్తిడి గ్రామ యువకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్