కొమురంభీం జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి గార్డెన్లో ఆదివారం జిల్లా బీజేవైఎం శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్ ను సన్మానించడం జరిగింది. ముందుగా వారికి పూల బోకే అందించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపి సీనియర్ నాయకులు బోనగిరి సతీష్ బాబు, నాయకులు అరిగెల నాగేశ్వరరావు, కోట్నక విజయ్, యెలాగతి సుచిత్, ఇగురపు సంజీవ్, మరెడి కార్తీక్, తదితరులున్నారు.