
ఇరు దేశాలు మంచి నిర్ణయం తీసుకున్నాయి: అమెరికా
భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలకు బ్రేక్ పడేలా మంచి నిర్ణయం తీసుకున్నాయని అమెరికా ప్రకటించింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో వెల్లడించిన వివరాల ప్రకారం, భారత్, పాకిస్థాన్ రెండు దేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. త్వరలోనే న్యూట్రల్ వేదికపై విస్తృతంగా చర్చలు ప్రారంభించనున్నాయి. భారత ప్రధాని మోదీ, పాక్ ప్రధాని షరీఫ్లు చర్చల మార్గాన్ని ఎంచుకోవడం "వివేకవంతమైన నిర్ణయం" అని కొనియాడారు.