వాంకిడిలో నేడు విద్యుత్తు అదాలత్

వాంకిడి మండల కేంద్రంలోని విద్యుత్తు ఉపకేంద్రంలో మంగళవారం విద్యుత్తు అదాలత్ నిర్వహించనున్నట్లు ఏఈ శ్రీకాంత్ తెలిపారు. ఉదయం 9గంటల నుంచి కొనసాగుతుందన్నారు. విద్యుత్తు బిల్లుల సమస్యలను పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా అధికారులు ఏఓ ఈశ్వర్, ఏఏఓ తుకారాం, ఏడీఈ శ్రీనివాస్ పాల్గొంటారని, ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.