బాదితులు పోగొట్టుకున్న 50 ఫోన్లను ఆసిఫాబాద్ పోలీసులు రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. జిల్లా వ్యాప్తంగా 3 నెలల్లో వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోన్లు పోగొట్టుకున్న వారికి ఎస్పీ శ్రీనివాస్ రావు ఎస్పీ కార్యాలయంలో బుధవారం అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే వేంటనే సీఈఐఆర్ వెబ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. మొత్తం 50 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామన్నారు.