వాంకిడి మండల కేంద్రంలోని అండర్ పాస్ బ్రిడ్జిల క్రింద వర్షం వచ్చినప్పుడల్లా వర్షపునీరు ఆగి అది కాస్త రోజులు నెలలు గడవడంతో మురికి నీరుగా మారుతుందని మండల ప్రజలు తెలిపారు. దీని ద్వారా ప్రయాణం ఇబ్బంది కరంగా తయారైంది అన్నారు. పక్కపొంటి పోయే వాహనాలు వేగంగా పోవడంతో ఆగి వున్న మురికి నీరు మరోపక్కన వాహనదారులపై పడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు స్పందించి వర్షపు నీరు నిలువ ఉండకుండా చూడాలని కోరుతున్నారు.