రెబ్బెన మండలంలోని ప్రజలందరూ పండుగను ప్రశాంత వాతావరణంలో సాంప్రదాయాల నడుమ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించుకోవాలని గురువారం రెబ్బెన ఎస్సై డి. చంద్రశేఖర్ సూచించారు. ముఖ్యంగా యువత మద్యం సేవించి వాహనాలను నడపడం చట్టరీత్యా నేరమని తెలియజేశారు. మండల ప్రజలు సహజ సిద్ధమైన రంగులను వాడి పండుగను నిర్వహించుకోవాలన్నారు.