సిర్పూర్ టీ మండలం నవేగాం గ్రామంలో ఈ నెల 14 నుండి 16 వరకు నిర్వహించే కబడ్డీ పోటీల వాల్ పోస్టర్ ను ఆదివారం కాగాజ్ నగర్ పట్టణంలోని తన నివాసంలో ఎమ్మెల్సీ దండే విఠల్ విడుదల చేశారు. యువకులు విద్యతో పాటు ఆటల్లోనూ రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ ఎంపీపీ ఇర్త సత్యం, ఎల్ములే కిషోర్, నార్గవర్ రాజు, కిర్మరే తరుణ్, కబడ్డీ నిర్వహణ కమిటీ సభ్యులు నాగోసే రాహుల్, జునగరే రాజు, గౌతమ్, తదితరులు ఉన్నారు.