వైభవోపేతంగా బాలేశ్వరుడి రథోత్సవం

73చూసినవారు
కొమురంభీం జిల్లా కేంద్రంలోని పెద్దవాగు ఒడ్డున ఉన్న బాలేశ్వర స్వామి రథోత్సవానికి భక్తజనం పోటెత్తింది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం నిర్వహించిన జాతర, రథోత్సవం నిర్వహించారు. స్వామివారి ఆలయం నుంచి బాలేశ్వరుని విగ్రహాన్ని భక్తుల కోలాహలం మధ్య ఊరేగించారు. ఉదయం నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్