గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిలో అధికారుల సమన్వయం మర్చిపోలేనిదని జిల్లా పరిషత్ చైర్మన్ కోనేరు కృష్ణారావు శనివారం అన్నారు. జిల్లా పరిషత్ సభ్యుల పదవీకాలం వచ్చే నెల 5వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మీతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.