కొమురం భీం జిల్లాలో ఎరువుల కొరత లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కలెక్టరేట్లో డీఎఫ్వో నీరజ్కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావులతో కలిసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఆగ్రో, డీసీఎంఎస్, ప్యాక్స్ల ద్వారా ఎరువుల పంపిణీ చేయాలన్నారు. ఫర్టిలైజర్ షాలను వ్యవసాయ అధికారులు తరచూ తనిఖీలు చేయాలని సూచించారు.