చిన్నారులందరికీ పోషకాహారం తప్పనిసరి అందించాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ బి. కుమారి అన్నారు. వాంకిడి మండలంలోని ఇందాని గ్రామ పంచాయతీ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా బి. కుమారి మాట్లాడుతూ పౌష్టికాహారం లోపిస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులతో పాటు గర్భిణులకు, బాలింతలకు పోషకాహారం అందిస్తున్నట్లు తెలిపారు.