వాంకిడి: భూ భారతి ద్వారా భూ సమస్యల సత్వర పరిష్కారం

63చూసినవారు
వాంకిడి: భూ భారతి ద్వారా భూ సమస్యల సత్వర పరిష్కారం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం ద్వారా భూ సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం జిల్లాలోని వాంకిడి మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావులతో కలిసి హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్