పులుల సంరక్షణ పేరుతో రైతులను నిర్వాసితులను చేసె కుట్రలను సహించమని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవి కుమార్ అన్నారు. కాగజ్నగర్లో ఏర్పాటు చేసి పత్రికా సమావేశంలో అయన మాట్లాడుతూ.. కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్లో టైగర్ కారిడార్ ఏర్పాటు చేస్తే చాలా గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తుందని టైగర్ కారిడార్ ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కూశన రాజన్న తదితరులున్నారు.