కాగజ్నగర్ మండలం గన్నారంలో ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా సోమవారం ఆమె కుటుంబీకులు యువకుడి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. 3ఏళ్లుగా ఆమెను ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో అనూష ఆదివారం ఆత్మహత్య చేసుకుందని కుటుంబీకులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళను అదుపు చేశారు.