తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ పాలనలో మహిళలకు, విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందని బీ. ఆర్. ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రవీణ్ కుమార్ అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో బుధవారం రాత్రి క్యాండిల్ ర్యాలీ నిర్వహించి ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లాకు చెందిన మల్లీశ్వరి కుల వివక్షత కారణంగానే ఆత్యహత్యకు పాల్పడిందని, ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.